ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో రష్మిక.. కానీ..?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఇందులో రష్మిక మందాన్నా సందడి చేయనున్నారట. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్గా నిలవనుందని టాక్. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రష్మిక మందాన్నా ఓ గ్రాండ్ స్పెషల్ సాంగ్లో నటించనున్నారట. ఈ పాట కథలో కీలక భాగంగా సెకండ్ హాఫ్లో వస్తుందని, రష్మిక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లో అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్పై ఏళ్ల తరబడి కసరత్తు చేశారు.
ఆడియన్స్ను అవాక్కయ్యేలా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆయన స్వయంగా చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.