Hyderabad: ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం

Hyderabad: రోజు రోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. హైదరాబాద్ MMTS ట్రైన్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి తన సెల్ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్కు వెళ్లి పని ముగించుకుంది.
అనంతరం ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. మహిళల బోగిలోకి ప్రవేశించిన అగంతకుడు ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న MMTS ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.