తెలంగాణ
Rajasingh: పాకిస్తాన్పై దాడి సరిపోదు.. యుద్ధం ప్రకటించాలి

Rajasingh: పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా సమాధానమిచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తయారుచేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్పై దాడి మాత్రమే అసలైన సమాధానం కాదు ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ఖతం చేయాలని కోరారు. భారతావని సింధూరానికి ఉన్న విలువను పాకిస్తాన్ సహా విద్వేషకారులకు తెలియజేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.