తెలంగాణ
Raja Singh: బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన రాజాసింగ్

Raja Singh: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని బీజేపీ నేత రాజాసింగ్ ఖండించారు. దాడి ఘటనపై సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా అని రాజాసింగ్ ప్రశ్నించారు.
తాము తలచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ను తగలబెడతామని హెచ్చరించారు. దాడి చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారాయన. యుద్ధం చేయడానికైనా .. రాజకీయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని.. అంత వరకు తెచ్చుకోవద్దని రాజాసింగ్ హెచ్చరించారు.