తెలంగాణ
కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రెయిన్ ఎఫెక్ట్

కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రెయిన్ ఎఫెక్ట్ పడింది. దీంతో పుష్కరాలకు భక్తుల సంఖ్య తగ్గింది. వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాల నుండి భక్తజనం మందకొడిగా వస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక గాలివాన బీభత్సంతో రోడ్లు బురదమయంగా మారగ పార్కింగ్ స్థలాలు నీట మునిగాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.