పూరి-విజయ్ సేతుపతి సినిమా నుంచి క్రేజీ న్యూస్!

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించారు. ఈ చిత్రం పూరి గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి విఫలాల తర్వాత పూరి ఈసారి సరికొత్త కథతో రాబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గతంలో రాసినవాటికి భిన్నంగా, బలమైన ఎమోషన్స్తో నిండి ఉందని టాక్. విజయ్ సేతుపతి పాత్రలో మూడు విభిన్న కోణాలు ఆకట్టుకోనున్నాయట.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫ్లాష్బ్యాక్లో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. గతంలో డబుల్ ఇస్మార్ట్లో కంటెంట్ లోపించిందని విమర్శలు రాగా, ఈసారి పూరి ఆ విమర్శలకు చెక్ పెట్టేలా కథ రెడీ చేశారని అంటున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పూరి ఈ కొత్త ప్రయోగంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా? అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.