సినిమా

Proddatur Dussehra: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రొద్దుటూరు దసరా’

Proddatur Dussehra: తెలుగు సంస్కృతి, పండుగల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో తెరకెక్కిన ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఈటీవీ విన్‌లో ప్రేక్షకులను పలకరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల అద్భుత వైభవం, ప్రజల ఆచారాలు, భక్తి, కళా సంప్రదాయాలను చూపిస్తూ రూపొందించిన ఈ 40 నిమిషాల డాక్యుమెంటరీని దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ రూపొందించారు. ప్రేమ్ కుమార్ వాలపాలా నిర్మాణంలో బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సహకారంతో ఈ చిత్రం రూపొందింది.

ఉత్సవాల సమయంలో ప్రజల ఉత్సాహం, సాంప్రదాయ ప్రదర్శనలు, భక్తి భావం అన్నీ ఈ చిత్రంలో నిజ జీవిత దృశ్యాలతో చూపించారు. హై టెక్నికల్ క్వాలిటీ, అద్భుత విజువల్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.

ప్రస్తుతం స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా, కిలారి సుబ్బారావు పీఆర్‌ఓగా వ్యవహరిస్తున్నారు. బాల్కనీ ఒరిజినల్స్ నుంచి త్వరలో మరిన్ని సంస్కృతి ఆధారిత డాక్యుమెంటరీలు విడుదల కానున్నాయని మేకర్స్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button