Private Schools: స్టాండర్డ్ కోసం పెద్ద స్కూల్ వైపు జనం పరుగులు

Private Schools: పాఠశాలల్లో బడి గంట మోగింది. గంట శబ్దం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపుతుండగా వారి తల్లిదండ్రుల్లో మాత్రం వణుకు పుట్టిస్తోంది. స్టాండర్డ్ చదువుల కోసం తల్లిదండ్రుల అవసరాలను అవకాశంగా మార్చుకుని దోచేస్తున్నారు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు.
కనీస అవసరాలు లేకుండా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, స్కూల్స్కు వెళ్లాలంటే చిన్నారులు భయపడుతున్నారు. తల్లికి వందనం , ఫీజులు నియంత్రణ లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వత్తిడి నడుమ మొదలవుతున్న 2025 విద్య సంవత్సరంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం.
ఆడుతూ పాడుతూ వేసవి సెలవలు ముగిసిపోయాయి. చిన్నారులు స్కూలుకు వెళ్ళే రోజు వచ్చేసింది. అప్పుడే తల్లితండ్రులకు కొండంత భారం ఎదురుగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య ఒక టిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు.
కానీ పేద, మధ్యతరగతి విద్యార్థుల తలరాత మారడం లేదు.
కూలి చేసుకొని ప్రభుత్వ సహకారంతో మట్టిలో మాణిక్యాలుగా పిల్లలను తీర్చిద్దాలనుకున్న తల్లిదండ్రులకు చేదు అనుభవమే మిగులుతుంది. పిల్లలకు బడులకు పంపేందుకు తల్లిదండ్రులకు తల్లికి వందనం ఇప్పటికీ రాకపోవటంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇబ్బందులు ఎదురుకావటం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరుతో 20వేలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు డబ్బులు వేయలేదట. కనీసం 2025 నాటి పథకం కోసమైన స్పష్టమైన ప్రకటన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జియో టాగింగ్ సర్వేలో 8 లక్షల మంది నిరక్షరాస్యత ఉందని తేలడంతో ఈ విద్య సంవత్సరం చాలా కీలకంగా మారింది.
మరో వైపు విద్యకు పెద్ద వేశామన్న ప్రభుత్వం చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, కొన్నిచోట్ల పరివేక్షణ లేకపోవటంతో పాఠశాలలు అధ్వానంగా మారిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు లేకోవటంతో గిరిజనులు విద్యకు దూరం అవుతున్నారు.
ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయం చెప్పనక్కర్లేదు. ప్రైవేటు స్కూల్స్ యజమాన్యాలు ఫీజు దోపిడీని షూరు చేశాయి. అధిక ఫీజుల పేరుతో మధ్యతరగతి, నిరుపేదలను పిండి.. పీల్చిపిప్పి చేస్తున్నాయి. నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం మాత్రం శూన్యం. వేలు, లక్షల ఫీజుల పెంపుతో సగటు నిరుపేద విద్యార్థి తల్లిదండ్రుల గుండె గుబేల్ మంటోంది.
కొన్ని స్కూళ్లల్లో ఎల్ కేజీకి లక్షా 20 వేలు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో తరగతికి రూ. లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేలకు పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్మిషన్ల టైంలోనే పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, షూలను విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడీతో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రుల జేబులు కాళీ చేస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్ అన్నీ ఇక్కడే తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఎల్ కేజీ కోసం పాఠశాల యాజమాన్యాలు లక్షలు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదట.
రేపటి తరానికి ముఖ్యమైన విద్య ఎంత అవసరమో పిల్లల్లో వికాసవంతమైన వాతావరణం కూడా అంతే అవసరం. అందుకు అనుగుణంగా పిల్లల్లో వత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన విద్యను, క్రీడలను అందించేలా గ్రౌండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తూ స్థానికంగా ఫీజులపై చర్యలు
తీసుకోవాలని వారు కోరుతున్నారు.