తెలంగాణ
Principal abuse: బూతులు మాట్లాడుతూ విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్

Principal abuse: గురుకుల గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలత అరాచకం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు విద్యార్ధినులపై దాడి చేసింది ప్రిన్సిపాల్. అంతేకాదు.. విద్యార్థినులను ప్రిన్సిపాల్ సాయిలత నానా బూతులు తిట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఎవరికైనా చెబితే టీసీ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
వికారాబాద్ జిల్లా కొత్తగడిలో వెలుగులోకి వచ్చిన ఘటన చర్చనీయాంశమైంది.
ఇక గతంలో కూడా ఓ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దాడి చేసినట్లు తెలిసింది. అయితే.. వేధింపులు తాళలేక స్కూల్ బిల్డింగ్ పైనుండి దూకడంతో.. విద్యార్థినికి కాలు విరిగింది. దీంతో గతం లో విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల ఆందోళన చేశాయి. ప్రిన్సిపాల్ సాయిలత వ్యవహారం నిత్యం వివాదాస్పదంగా మారుతోంది.