జాతియం
నేడు అహ్మదాబాద్కు ప్రధాని మోదీ

కాసేపట్లో అహ్మదాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్లో అమిత్ షా, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది.
ఇక విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. ఇందులో భాగంగా ప్రమాద కారణాలను డీజీసీఏ టీమ్ అడిగి తెలుసుకోనుంది.