ఆంధ్ర ప్రదేశ్
Machilipatnam: ఇంజిక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణీ మృతి

Machilipatnam: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఇంజిక్షన్ వికటించి ఏడు నెలల గర్బిణీ మృతి చెందింది. నోబెల్ కాలేజ్ రోడ్డులోని ఓ ప్రైవేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనరల్ చెకప్ కు హాస్పిటల్ కి వెళ్లిన మల్లేశ్వరికి ఉమ్మ నీరు తక్కువగా ఉందని డాక్టర్ ఇంజిక్షన్ ఇచ్చింది.
అయితే ఇంజిక్షన్ ఇచ్చిన కాసేపటికే దుర్గా మల్లేశ్వరి అస్వస్థతకు గురై మృతి చెందింది. దీంతో ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.