తెలంగాణ
Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు

Ponnam Prabhakar: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంప్రభాకర్, కలెక్టర్ పాల్గొన్నారు. 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3 వేల 500 ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పదేళ్ల తర్వాత ఇండ్లు వస్తున్నాయన్నారు.