తెలంగాణ
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కులగణన చేస్తే ఏం వస్తుందని అడిగేవారికి మంత్రి వర్గ విస్తరణే సమాధానం అని చెప్పారు. రాహుల్ గాంధీ సమాజిక న్యాయం కోసమే కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు.
మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకు ఇవ్వడం ద్వారా న్యాయం చేస్తే తిరిగి మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇది కాంగ్రెస్తోనే సాధ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఖర్గే మరియు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.