తెలంగాణ
Ponguleti: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే

Ponguleti: ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటేనని ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు.
గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి సీతారామ ప్రాజెక్టుకు కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పని చేసిందో చెప్పకనే చెప్పింది అని అన్నారు. రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందుతుందన్నారు.
ఆర్థిక పరిస్థితి బలహీనంగానే ఉన్నా, సుమారు రూ.680 కోట్లతో 16–17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 9 కిలోమీటర్ల పనులు మొదలయ్యాయని స్పష్టం చేశారు.