తెలంగాణ
Patancheruvu: పోలీస్ వాహనం బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు

Patancheruvu: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద పోలీస్ వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్రగాయాలు అయ్యాయి. టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా పడింది.
ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిందిగా తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ నుండి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఘటన జరిగింది.