ఆంధ్ర ప్రదేశ్
కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో కోడిపందాలు ఇంకా కొనసాగుతున్నాయి. కోడిపందాలు, పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో పది లక్షల నగదుతో పాటు.. సుమారు వంద కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే గ్రామంలో జాతర ఉన్న సందర్భంగా .. కోడి పందాలు నిర్వహించినట్టు పందెంరాయుళ్లు చెబుతున్నారు.