ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ లో ఉగ్ర కదలికలు.. అలెర్ట్ అయిన అధికారులు

బెజవాడలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. సిమితో సంబంధాలపై కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పది మంది అనుమానితుల్ని గుర్తించారు. విజయవాడలో నలుగురు శివారు ప్రాంతాల్లో మరో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏసీ మెకానిక్లు మసీదుల దగ్గర భిక్షాటన బడ్డీకొట్లలో పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నట్లు సమాచారం.