ఆంధ్ర ప్రదేశ్
Visakha: విశాఖ జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షురాలిపై కేసు

Visakha: విశాఖ జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షురాలిపై కేసు నమోదైంది. టీడీపీ మహిళ నేత సర్వసిద్ధి అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు నరేంద్రను గాజువాక పీఎస్లోనే చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అంతేకాదు గాజువాక సీఐ పార్ధసారధిని బదిలీ చేయిస్తా నని అనంతలక్ష్మి ఛాలెంజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి బయపెడుతోందని ఆరోపణలు కూడా వెల్లువె త్తుతున్నాయి.