ఆంధ్ర ప్రదేశ్
Satyavardhan kidnap Case: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. ఛార్జ్షీట్లో కీలక విషయాలు

Satyavardhan kidnap Case: టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కిడ్నాప్కు సంబంధించి ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ కిడ్నాప్కు తెరలేపారు. దాడి కేసును వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్పై ఒత్తిడిని పెంచారు. కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్పై సంతకాలు తీసుకున్నారు.
కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు. సత్యవర్ధణను బలవంతంగా విశాఖ, హైదరాబాద్కు తరలించారు.కేసులో ఆరుగురు అరెస్ట్ మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం 59 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ తీర్పు రానుంది.