ఆంధ్ర ప్రదేశ్
Gorantla Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన

Gorantla Madhav: వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శనకు దిగారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా ఇవాళ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేందుకు గోరంట్ల మాధవ్ భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే సెక్షన్ 35/3 బిఎన్ఎస్ఎస్ కింద గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.