PM Modi-Donald Trump: ట్రంప్-మోదీ భేటీ.. వలసలు, వాణిజ్యం… సుంకాలే ప్రధాన అజెండాగా చర్చలు

PM Modi-Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ హిస్టారికల్ మీట్ జరిగింది. వైట్హౌస్లో ట్రంప్-మోదీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వలసలు, వాణిజ్యం, సుంకాలే ప్రధాన అజెండాగా చర్చలు జరిగాయి. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ప్రధాని మోదీతో ట్రంప్ మొదటిసారి సమావేశం అయ్యారు. ఈ భేటీలో జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే అమెరికా-భారత్ కలిసి ఉండటం ముఖ్యమని వెల్లడించారు. మరోవైపు ఫ్రెండ్ మోదీని కలుసుకోవడం గౌరవంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాక్షించారు.
దేశాభివృద్ధికి తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు మోదీ. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్న మోదీ.. యుద్ధం ఆపాలని పుతిన్తో గంటన్నర మాట్లాడినట్లు చెప్పారు. శాంతి స్థాపన చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు.