మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో కలకలం

Hyderabad:హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న ఆయన అతిథిగృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. పారీ్టలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ (జైపూర్) సైతం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే, ఎనిమిది మంది వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
వీరిలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడితోపాటు మరో ఐదుగురు కొకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారించారు. మిగిలిన వారిని పరీక్షల కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఈగల్ టీమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మను టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పారీ్టకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నితీశ్ శనివారం సాయంత్రమే హైదరాబాద్కు వచ్చారు.



