తెలంగాణ
Hyderabad: ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలిన ఫోన్

Hyderabad: ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా సెల్ఫోన్ పేలింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని రింగ్బస్తీలో చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ఇంటిలో మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పోస్టుమార్టం నిమిత్తం సాయి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.