తెలంగాణ
Harish Rao: భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది

Harish Rao: సిద్ధిపేటలో శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమ కుండాలతో హనుమాన్ యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోందని హరీష్రావు అన్నారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిచివేసిందని అన్నారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారతదేశంలో శాంతి నెలకొలపాలని దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.