ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని హితవు పిలికారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు.