ఏపీ కేబినేట్ భేటీలో పవన్ కీలక చర్చ?

Pawan Kalyan: సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కేబినేట్ సమావేశంలో కీలకమైన అంశాల ఫై ప్రశ్నించ్చారంట. ప్రధానంగా లులూ గ్రూప్ లకి భూకేటాయింపుపై మంత్రివర్గ సమావే శంలో ఆసక్తికరమైన చర్చ జరిగిందని సమాచారం.కూటమి ప్రభుత్వం పలు సంస్థలకి భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలియచేయటం తో సంస్థలకి సంబంధించి అనేక అంశాలపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించ్చారంట.
అందులో భాగంగా లూలు సంస్థ షరతులు మరీ ఎక్కువుగా ఉన్నాయని రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్లు వ్యవహరిస్తోందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని పవన్ అడిగినట్లు సమాచారం. లులూ ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుస ప్రశ్నలు, సందేహాలు సంధించారు. . దీనిపై అధికారులతోపాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు.
సీఎం చంద్రబాబు సైతం లులూ గ్రూప్ షరతుల విషయంలో అసహనం వ్యక్తం చేసారంట. కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లులూ గ్రూప్లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకి లీజు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది ఆ సమ యంలో ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమా చారం ఉందా? అని డూప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ది చేస్తారని అధికారులు బదులిచ్చారంట ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదు.
అక్కడ అసలు ఏం పని చేస్తారు కూరగాయలు, పండ్లు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కణేశాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్ సూటిగా ప్రశ్నించారంట. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారంట. దీంతో అదికారులు నీళ్లు నమిలారని సమాచారం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారని సమాచారం.
రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లే దని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేశారంట. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లులూ గ్రూప్ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ ఆగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇవే అంశాలను ప్రస్థావించ్చారంట.
లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినేట్ సమావేశంలో ప్రస్తావించారంట. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా అని ప్రశ్నించారంట. దీనికి సంబంధిత అదికారులు సమాధానమిస్తూ లులూ యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చాంమన్నారంట. లులూ గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసారంట.
విశాఖపట్నం, విజయవాడల్లో లూలు సంస్థలకి ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని,అలాగే అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు ఏమిటని పవన్ ప్రశ్నించారు. లులూ గ్రూప్ లకి ప్రభుత్వం భూములు ఇచ్చి మాల్స్ ఏర్పాటు చేయమంటోంది, ప్రభుత్వమే భూములు ఇస్తోంది కానీ, షరతులు ఆ సంస్థ పెడుతుందేంటి? ఇదెక్కడి చోద్యం? అంటూ పవన్ విస్తుబోయినట్లు సమాచారం.
మూడు సంవత్సరాలకోసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్లో ఉంటోంది కానీ, ఆ కంపెనీ పదేళ్లకోసారి పెంచాలని కండీషన్ పెడు తోంది? వీటిపై ప్రభుత్వం ఏవిధంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించ్చారంట. మాల్స్ నిర్మానం పూర్తయ్యాక ఆ కంపెనీ షాప్ల రెంట్ ఎలా పెంచుతుంది? మూడేళ్లకో సారి అద్దెలు పెంచుతారా? లేక పదేళ్లకోసారి పెంచుతామని చెబుతారా? అని పవన్ ఆయా శాఖ కి చెందిన మంత్రిని, అధికారులని అడిగారంట.
లులూ ఏర్పాటు చేసే మాల్స్, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైనా పవన్ కల్యాణ్ పలు సందేహాలు వ్యక్త పరిచారు. విశాఖ, విజయవాడలో లులూ గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్ సంస్థల్లో ఉద్యోగాలు ఎవరికి ఇవ్వబోతున్నారని, స్థానికులకు ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పి స్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలు లేవనేత్తారని సమాచారం. సహజంగా ఆ కంపెనీ కి చెందిన సిబ్బందిని మాత్రమే నియమించుకుంటుందేమో కదా అని అన్నారంట.
ఇక్కడా అలాగే జరుగుతుందా,అదే జరిగితే ఇక్కడ భూములు ఇచ్చి ఏం లాభం? కచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకా శాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారంట. ఈ విషయంలో మనం ఎలాంటి విధానం అనుసరించబోతున్నామని డూప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. స్థానికులకు ఉద్యో గాలు ఇచ్చే విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటిస్తామని అధికారులు సమాదానమిచ్చినట్లు సమాచారం.
లులూ గ్రూప్ కొన్ని అతి షరతులు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారంట. గత ప్రభుత్వం లూలు కంపెనీని రాష్ట్రం నుంచి తరిమివేసిందని కూటమి ప్రభుత్వం తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటోందని అయితే ఆ కంపెనీ అనేక షర తులు పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకూ, రాష్ట్రానికి మేలుచేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని మంత్రి అసగాని బదులిచ్చారంట. లులూ గ్రూప్ షరతుల విషయంలో ముఖ్యమంత్రి కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.



