ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు

Pawan Kalyan: గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్ను అంధకారంలోకి నెట్టిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులకు అండగా ఉంటామని ఐదేళ్ల క్రితం మాట ఇచ్చామని గుర్తుచేశారు.
ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోడీతో పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు. వైసీపీ హయాంలో రాజధాని తరలిపోతుందనే భయం అందరిలోనూ కలిగిందని వెల్లడించారు. చివరకు అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారని చెప్పుకొచ్చారు.