Pawan Kalyan: కూటమిలో క్రియాశీలకంగా పవన్ కల్యాణ్

Pawan Kalyan: రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని శత్రువులతోనే ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతుందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొందరు నేతలు కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నారట. అందుకే పిఠాపురంలో పవన్, జనసేనపై ప్రజా వ్యతిరేకత ఏర్పడేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ్. ఇంతకీ పవన్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేత ఎవ్వరు..? పిఠాపురంలో అసలేం జరుగుతుంది..?
పవన్ కల్యాణ్ ఇది ఓ పేరు మాత్రేమ కాదు ఓ బ్రాండ్గా భావిస్తారు ఆయన అభిమానులు. దశాబ్దకాలం పాటు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీరోల్ ప్లే చేయడమే కాదు ఎన్నికల సమరంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మేజారిటీతో గెలుపొందారు పవన్ కల్యాణ్. తర్వాత డిప్యూటీ పదవిని అధిగమించారు.
అయితే కూటమిలో పవన్ క్రియాశీలకంగా ఉంటే తమను పట్టించుకునే వారే ఉండరని టీడీపీ కాపు నేతలు అంతర్మథనం చెందుతున్నారట. అందుకే పవన్ను ఎలాగైనా కూటమి నుంచి సాగనంపేందుకు పొగ పెడుతున్నారని జనసేన అనుమానిస్తోంది.
పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వర్మ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, లోకేశ్కు సన్నిహితుడైన కాపు సామాజిక వర్గానికి చెందిన లోక్సభ సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులంతా వెనకుండి వర్మను ఎగదోస్తున్నారనే చర్చకు తెరలేచింది.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మొదటి నుంచి కాపుల్ని అణచివేస్తున్నారనే అభిప్రాయం ఆ సామాజిక వర్గంలో వుంది. యనమలకు వర్మ రాజకీయంగా శిష్యుడిగా మెలుగుతుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాకినాడ జిల్లా వరకూ పవన్ మాటే చెల్లుబాటు అయ్యేలా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడదే జరుగుతోంది. కానీ పవన్ కారణంగానే రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని టీడీపీ కాపు నాయకుల్లో భయం పట్టుకుంది. అందుకే పవన్, జనసేన నేతలపై టీడీపీ కాపు నాయకులు గుర్రుగా ఉన్నారు.
ఇటీవల జ్యోతుల నెహ్రూ మినీ మహానాడులో సంచలన కామెంట్స్ వెనుక భారీ వ్యూహం వుందని అంటున్నారు. జనసేనతో పొత్తు వద్దని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పిఠాపురంలో ఇసుకను జనసేన నాయకులు కొల్లగొడుతున్నారని వర్మ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పోలీసులకు రేచీకటి అని, రాత్రివేళ వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్నా కనిపించడం లేదని విమర్శించారు.
ఇలాగైతే పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు కూచోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. కొత్తగా కండువాలు కప్పుకొని అక్రమంగా దందా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పేదలకు ఇసుక దొరకడం లేదని పెద్ద పెద్దలారీలతో ఇసుకను దోచుకుపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా వర్మలో అసహనం కల్గించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మని బహిరంగంగా చెప్పడంతో వర్మకు షాక్ తగిలింది.
ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను భుజానెత్తుకుని గెలిపించే బాధ్యత తీసుకున్నారు వర్మ. అందుకే వర్మ తీవ్ర అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. అందుకే తన బలం, బలగం అయినా ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందానికంటే జనసేన వైఖరే ఆయనను రగిల్చివేస్తోంది. అందుకే ఇక చెక్ పెట్టాలని నిర్ణయించేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకినాడ ప్రజలకు తన నియోజకవర్గంలో పట్టాలిచ్చేందుకు అంగీకరించనని చెప్పడం ద్వారా కాకినాడలో జనసేన నాయకుడు, ఎంపీ ఉదయ్కు చెక్ పెట్టవచ్చనేది మరో ఆలోచనగా ఉంది. అందుకే ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని తన అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు వర్మ.
ఇవన్నీ కూడా పవన్కల్యాణ్ను రాజకీయంగా దెబ్బతీయడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీలో పెద్ద శక్తుల అండ లేకపోతే, వర్మ ఇంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితి వుండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ను టార్గెట్ చేయడంలో పైకి వర్మ కనిపిస్తున్నా కనిపించని అదృశ్య శక్తులున్నాయనే మాట వినిపిస్తోంది. మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది. పవన్ కళ్యాణ్కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.