ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: వృద్ధిరాలితో కలిసి భోజనం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన వృద్ధురాలిని పవన్ కృతజ్ఞతాపూర్వకంగా సన్మానించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరంటాలు తన పింఛను సొమ్ముతో అమ్మవారికి 27వేల విలువైన గరగ చేయించి కానుకగా సమర్పించారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ ఆమెను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఆమెతో ఆప్యాయంగా ముచ్చటించారు. 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు ప‌వ‌న్‌తో కలిసి భోజ‌నం చేయ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. చీర పెట్టి సన్మానించారు. ఆమె బాగోగులు తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button