News

Pawan Kalyan: తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా… పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తమిళనాడులోని తంజావూరుకు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని, కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.

స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ యాత్రలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button