తెలంగాణ
Palla Rajeshwar Reddy: కేటీఆర్పై ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది

Palla Rajeshwar Reddy: కేటీఆర్పై ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సంపదతో పాటు ఖ్యాతి పెరిగిందన్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కే
టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లకుండా ముందస్తు విచారణకు రావాలని ఏసీబీతో నోటీసులు ఇప్పించారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్ మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.