అంతర్జాతీయం

Mohsen Rezaei: మాపై అణు బాంబులు వేస్తే ఇజ్రాయెల్‌పై పాక్‌ అణు దాడి చేస్తుంది

Mohsen Rezaei: కొన్నిసార్లు బయటకు ఏవీ కన్పించవు. ఎవరు ఎవరి పక్షం అన్నది కన్పించదు. కులాలు, మతాలు ఆధారంగా ఎవరు ఎటువైపుంటారో మనకు చరిత్ర చెబుతూనే ఉంటుంది. ముస్లిం దేశమైన కారణంగా నాడు ఇండియా నుంచి ఎన్నో విధాలుగా మేళ్లు పొందిన టర్కీ, చివరకు పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడాన్ని మనం చూశాం. ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది.

అమెరికా నుంచి బచ్చం వెత్తుకొని బతికే పాకిస్తాన్, ఇప్పుడు తాము ఇరాన్‌ను ఇజ్రాయెల్ బారి నుంచి కాపాడుతానంటోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే, తక్షణం, పాకిస్తాన్, ఇజ్రాయెల్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తోందని హెచ్చరించిందట. ఈ విషయాన్ని ఎవరో చెప్తే లైట్ తీసుకోవాలి. కానీ సాక్షాత్తూ ఇరాన్ అగ్రనాయకుడిగా చలామణీ అవుతున్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు.

మొత్తంగా ఇజ్రాయెల్ తెగించి కొట్లాడితే, అప్పుడు ఇరాన్ ను కాపాడే పెద్దన్న పాత్రను పాకిస్తాన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దెబ్బకు ధనక, సంపన్న దేశాలు కకావికలమైతే పాకిస్తాన్, అణ్వాయుధాలతో ఇరాన్ ను కాపాడుతానంటూ చేస్తున్న ప్రకటనను నిపుణులు సిల్లీ అంశంగా కొట్టి పారేస్తున్నారు.

తమపై అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఇజ్రాయెల్‌పై పాకిస్తాన్ అణ్వాయుధ దాడి చేస్తుందని ఇరాన్ దీమా వ్యక్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లపై క్షిపణుల దాడి జరుగుతుండగా, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ఉన్నాధికారి మొహ్సేన్ రెజా ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ ఇరాన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని దాని ఉన్నత దళాలకు చెందిన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేఫథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్‌లపై క్షిపణుల దాడి జరుగుతుండగా ఇరాన్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మొహ్సేన్ రెజాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు, రెండు దేశాలలో సుమారు 248 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 230, ఇజ్రాయెల్ నుంచి 18 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే, ఇజ్రాయెల్‌పై అణు బాంబుతో దాడి చేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు. ICAN ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ప్రకారం, ప్రస్తుతం అణ్వాయుధాలను కలిగి ఉన్న తొమ్మిది దేశాలలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఉన్నాయి.

పాకిస్తాన్ తమ వెనుక నిలబడతానని ముస్లిం దేశాల సాక్షిగా పేర్కొందని ఇరాన్ అంటోంది. 2024 ప్రారంభంలో ఇరుదేశాల మధ్య క్షిపణి ఎక్స్చెంజ్ కార్యక్రమం జరిగింది. ఐతే ఇరాన్ వద్ద ఇంకా ప్రపంచానికి తెలియని, ఎన్నో ఆయుధాలున్నాయన్నారు. ఇజ్రాయెల్‌పై అణ్వాయుధాలను ఉపయోగించడంపై పాకిస్తాన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇజ్రాయెల్‌పై పోరాటంలో అరబ్ దేశాలకు ఇరాన్‌కు మద్దతు ఇచ్చింది.

ఇరాన్‌కు వ్యతిరేకంగా సైనికపరంగా పాల్గొనడానికి అమెరికా నిరాకరిస్తోంది. పశ్చిమాసియాలో పోరాడుతున్న రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయమై తాము రష్యా, చైనాతో సంప్రదిస్తున్నామన్నారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇరాన్‌కు ట్రంప్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇరాన్‌ అమెరికాపై దాడి చేస్తే, అమెరికా సాయుధ దళాల పూర్తిగా రంగంలోకి దిగుతాయని, అప్పుడు ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ సృష్టించే సంఘర్షణల గురించి పాశ్చాత్య ప్రపంచం ఆందోళన చెందుతోందన్నాడు.

ఇది మొత్తం ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న దేశాలను కూడా దెబ్బతీస్తోందన్నాడు. ఇజ్రాయెల్‌ మోసపూరిత దేశమని దుయ్యబట్టారు. వినాశకరమైన పరిణామాలతో ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోందన్నాడు.
ట్రంప్ ప్రపంచ శాంతికి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపినా, రష్యా, చైనా ఇంకా ఎటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button