Pakistan stock market: భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్

Pakistan stock market: భారత్తో వివాదంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నెలకూలాయి. భారత బలగాల సైనిక చర్య దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. ఇప్పటి పాక్ ఆర్థికంగా దివాలా తీయగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట చేపట్టిన దాడులు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. భారత దాడుల వార్తలతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ కరాచీ-100 ఆరంభంలోనే సుమారు 6 శాతం కుప్పకూలి, 6వేల 272 పాయింట్లు నష్టపోయింది.
భారీ పతనంతో మార్కెట్ వెంటనే నిలిపివేశారు. ఇది రెండో అతిపెద్ద ఇంట్రా-డే పతనంగా నిలిచింది.. గత నెలలో అమెరికా సుంకాల ప్రకటన తర్వాత దాదాపు 8,700 పాయింట్ల నష్టం తర్వాత స్థానంలో నిలిచింది. ఇండియా దాడులు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచదేశాల మధ్యవర్తిత్వంతో ఈ వివాదం స్వల్పకాలికంగానే ఉంటుందని ఆశిస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.