అంతర్జాతీయం
India: మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్ లేదు

India: అంతర్జాతీయ వేదికలపై తరచూ పాకిస్థాన్ భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. UNO మానవ హక్కుల మండలిలో దాయాది దేశం ఆరోపించింది.
ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అంతేకాక.. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. అలాగే.. భారత్పై ఆరోపణలు చేయడం మానేసి.. వారి దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంపై ఫోకస్ పెట్టాలని చురకలు అంటించింది.