తెలంగాణ
హనుమకొండ జిల్లా పరకాలలో అధికారుల భూ సర్వే

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అందిస్తున్న నేపథ్యంలో సాగుకు అనుకూలంగా లేని భూములపై నివేదిక ఇవ్వనున్నారు. గృహాలు, పరిశ్రమలు, గోడౌన్స్, రియల్ ఎస్టేట్ ప్లాట్లను గుర్తించి ప్రభుత్వాన్ని నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 20న భూ సర్వే ముగుస్తుందన్నారు. ఈనెల 21 నుండి గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాను విడుదల చేస్తామని ఆర్డీవో తెలిపారు.