ఆంధ్ర ప్రదేశ్
Bhadrachalam: కాలేజీ లెక్చరర్ల వేధిపులు భరించలేక నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమంటోంది బాధితురాలు. నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.
ఆత్మహత్యయత్నానికి కారకులైన వారి పేర్లను నర్సింగ్ సూసైడ్ లెటర్లో రాసినట్లు సమాచారం. అయితే స్టూడెంట్ రాసిన లెటర్ వార్డెన్ దగ్గర ఉన్నట్లు సమాచారం.