ఎన్టీఆర్ జయంతి: తారక్ ట్వీట్ వైరల్!

NTR: నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఎమోషనల్ క్షణాలు, తారక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తెలుగు సినిమా దిగ్గజం, నటసామ్రాట్ ఎన్టీఆర్ 102వ జయంతి నీ ఈ రోజు అభిమానుల గుండెల్లో స్ఫూర్తిగా నిలిచింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించి, ఆ గొప్ప నటుడిని స్మరించుకున్నారు. అభిమానుల సందడితో ఘాట్ కళకళలాడింది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ రాసిన హృదయస్పర్శి పోస్ట్ వైరల్గా మారింది.
“మీ గొప్పతనం తెలుగు జాతి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుంది తాతగారూ.. మీ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది,” అంటూ తారక్ రాసుకొచ్చారు. ఈ రోజు నందమూరి కుటుంబం, అభిమానులు ఆయన సినిమా, రాజకీయ సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్లో సందడి చేస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ సినిమాలతో అభిమానులకు పండగ చేస్తూ, తాత బాటలో నడుస్తున్నారు.