తెలంగాణ
ఓయూలో NSUI 55 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ ఓయూలో NSUI 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో NSUI జెండాను విద్యార్థి నాయకుడు మేడ శ్రీను ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యార్ధుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని NSUI నాయకులు తెలిపారు.
ప్రజా పాలనలో విద్యార్ధుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తెలిపారు. NSUI రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో NSUI ముందుంటుందన్నారు.