తెలంగాణ
Niranjan Reddy: ఏడాదిలోనే 450 మంది రైతులు ఆత్మహత్యలు

Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు మేలు చేయకపోగా ఇంకా ఇబ్బందులకు గురి చేసిందన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతు భీమా పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భీమా కింద ఎల్ఐసీకి చెల్లించాల్సిన 750 కోట్ల ప్రీమియంను చెల్లించలేదన్నారు నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఏడాది కాలంలోనే 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సాగునీరుకు ఇబ్బంది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అబద్ధాలు చెప్పించారని అన్నారు.