ఆంధ్ర ప్రదేశ్
Nimmala Ramanaidu: ప్రపంచంలో ఎనిమిదో వింత ఏంటి అంటే అది జగన్

Nimmala Ramanaidu: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎనిమిదో వింత ఏంటి అంటే అది జగన్ మాత్రమే అన్నారు నిమ్మల. చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో జగన్ తనకు తానే సాటి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసం చేశారని చెప్పారు. ఇక నిర్వాసితులకు జగన్ ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదన్నారు నిమ్మల