ఆంధ్ర ప్రదేశ్

Nimmala Ramanaidu: రాయలసీమకు ఏ సీఎం చేయనంత ద్రోహం జగన్‌ చేశారు

Nimmala Ramanaidu: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రాయలసీమకు ఏ సీఎం చేయనంత ద్రోహం జగన్‌ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హంద్రీనీవా పాపానికి, జాప్యానికీ రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే జగనే కారణమని ఆరోపించారు.

రాయలసీమలో అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గత సర్కార్‌ చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు వచ్చే వారంలో హంద్రీనీవా పనుల పరిశీలనకు వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button