వ్యాపారం
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం సరికొత్త జోష్ కనిపించింది. 10 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా భారీ ర్యాలీగా సూచీలు దూసుకెళ్లాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 73, 730 దగ్గర ముగియగా నిఫ్టీ 254 పాయింట్లు లాభపడి 22, 337 దగ్గర ముగిసింది.
ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 31 పైసలు లాభపడి 86.96 దగ్గర ముగిసింది.నిఫ్టీలో అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రధాన లాభాలను ఆర్జించగా బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి.