జాతియం

Pahalgam attack: ఉగ్రదాడికి సంబంధించి వెలుగులోకి కొత్త వీడియో

Pahalgam attack: పహల్‌గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బైసరన్‌ వ్యాలీకి టూరిస్ట్‌గా వచ్చిన అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డు చేశాడు. జిప్‌లైన్‌పై.. రైడ్‌ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి.

ఉగ్రదాడి ఘటనలో ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే, దిగువన జరుగుతున్న విషయాలేవీ ఆ పర్యాటకుడు గుర్తించలేదు. చెప్పాలంటే తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చు అంటున్నారు అధికారులు. దీనికితోడు రైడ్‌కు ముందు జిప్‌లైన్‌ ఆపరేటర్‌ వ్యవహార శైలి తీరుపైనా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉగ్రదాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు మరింత స్పీడప్ చేసింది.

పహల్‌గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తును వేగవంతం చేసిన NIA జిప్‌లైన్ ఆపరేటర్‌కు సమన్లు అందజేసింది. మరోవైపు టూరిష్ట్ రిషి భట్ జిప్ లైన్ ఆపరేటర్ పైనే అనుమానం ఉందటున్నాడు. జిప్‌లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని మూడుసార్లు అన్న తర్వాతే కాల్పుల శబ్దం వినిపించిదని చెబుతున్నాడు. అయితే కాల్పు లు జరుగుతున్నా టూరిస్టులను మాత్రం ఆపరేటర్ వారించలేదని రిషి భట్ ఆవేదన వ్యక్తం చేశాడు. రిషి భట్ అహ్మదాబాద్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button