ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో భద్రతా బలగాల మాక్ డ్రిల్

Tirumala: ఆపరేషన్ సిందూర్తో పాక్ వెన్నులో వణుకు పుట్టించారు భారత సైనికులు. ఆపరేషన్ సిందూర్తో భారత్ సత్తాకు తోక ముడిచిన పాక్ పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో సైతం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసింది.
మూడంచెల భద్రత కలిగిన టీటీడీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ దళాలు అప్రమత్తం అయ్యాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సివిల్ పోలీసులు, అక్టోపుస్ దళాలతో.. ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు.