Nayanthara: ఆగని నయనతార డాక్యుమెంటరీ వివాదం!

Nayanthara: నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ మరోసారి వివాదంలో చిక్కుకుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో సినిమా క్లిప్స్ అనుమతి లేకుండా వాడారని ఆరోపణలు వచ్చాయి. ధనుష్ గతంలో కేసు వేయగా, ఇప్పుడు ఏబీ ఇంటర్నేషనల్ రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం ఎటు మళ్లుతుంది? పూర్తి వివరాలు చూద్దాం.
నయనతార జీవిత కథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదాల సుడిలో చిక్కుకుంది. ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా క్లిప్స్ను అనుమతి లేకుండా వాడారని ధనుష్ కోటి రూపాయల నష్టపరిహారం కోరగా, ఇప్పుడు ‘చంద్రముఖి’ క్లిప్స్పై ఏబీ ఇంటర్నేషనల్ రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు వేసింది.
నయనతార పర్మిషన్ కోసం ప్రయత్నించినా స్పందన రాలేదని సమాధానమిచ్చింది. హైకోర్టు అక్టోబర్ 6లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్నూ ఇరికించింది. ప్రస్తుతం నయనతార చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నటిస్తోంది.



