సినిమా

పరిశ్రమలో పవన్ కల్యాణ్‌పై పెద్ద కుట్ర జరుగుతోందన్న నట్టి కుమార్

థియేటర్ల మూసివేత అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకునేందుకే ఓ నలుగురు నిర్మాతలు కుట్ర చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు ఆజ్యం పోసేలా ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమే పవన్ కల్యాణ్‌పై పెద్ద కుట్ర జరుగుతోందని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. సినిమా పరిశ్రమ అంటే మేమే అన్న రీతిలో ఒంటెద్దు పోకడలతో కొందరు సినీ పెద్దలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు, సునీల్ నారంగ్ ఉన్నారని స్పష్టం చేశారు.

అలాగే ఉత్తరంధ్రలో అత్యధిక థియేటర్లు అల్లు అరవింద్‌ చేతిలోనే ఉన్నాయని తెలిపారు. దిల్ రాజు, అరవింద్‌లు బుక్ మై షో నుంచి పాప్ కార్న్, సమోసా వరకు అన్నింటిలోనూ దోచుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్‌కు ఈ సినీ పెద్దలు భయపడి చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు సాగుభూతి తెలపలేదని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబును కలుస్తారని నిలదీశారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు మంచి చేస్తుంటే వీళ్లు కుట్ర చేసి ఆయనకే వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు.

అసలు 1500 వందల మంది డిస్టి బ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఉంటే కేవలం 40 మందితో బంధ్‌ను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక కమిటీ వేసి కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకుని పరిశ్రమను కాపాడాలంటున్న నిర్మాత నట్టికుమార్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button