Narayana: వైసీపీ అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చింది

Narayana: నెల్లూరు జిల్లా అల్లిపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్న రీసైక్లింగ్ యూనిట్ ను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. పదిలక్షల అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్ళిందన్నారు. చెత్త తొలగింపులో వైసీపీ నిర్లక్ష్యం వహించిందన్నారు నారాయణ.
అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో పేరుకున్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు నారాయణ. అల్లీపురం డంపింగ్ యార్డులో ఇప్పటికే 5 వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసారని అన్నారు. మరో రెండు నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేస్తాం నారాయణ వెల్లడించారు.