ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేయిస్తా

Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు నిమ్మల. సెలైన్బాటిల్ చేతికి పెట్టుకుని సభలో పాల్గొన్నారు. అయితే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేయిస్తానన్నారు మంత్రి నారా లోకేష్. విశ్రాంతి తీసుకుంటారా సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని లోకేష్ అనగా నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని లోకేష్కు చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు.