ఆంధ్ర ప్రదేశ్
Nandigam Suresh: నందిగం సురేష్కు జూన్ 2 వరకు రిమాండ్

Nandigam Suresh: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. దీంతో కోర్టు నుండి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ను తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
తర్వాత నందిగం సురేష్ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి ఘటనలో నందిగం సురేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో వాదనలు-ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్కు రిమాండ్ విధించింది.