సినిమా

Naga Chaitanya: చేపల పులుసు వండిన నాగచైతన్య.. వైరల్ అవుతున్న వీడియో

Naga Chaitanya: టాలీవుడ్‌ యాక్టర్ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం తండేల్‌ . రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా నాగచైతన్య షూట్ లొకేషన్‌లో చేపలపులుసు వండిన వీడియోను షేర్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర పోషించేందుకు గాను నాగచైతన్య కొందరు మత్స్యకారుల జీవితాలను దగ్గర్నుంచి పరిశీలించి, తనను మలుచుకున్నారు. మీరు వండినట్టే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి మీకు వడ్డిస్తాను అని షూటింగ్ ప్రారంభంలో ఆ మత్స్యకారులకు నాగచైతన్య మాటిచ్చారట. అన్నట్టుగానే ఆయన మాట నిలుపుకున్నారు. కట్టెల పోయి మీద.. కడయ్ లో చేపల పులుసు వండి అక్కడి వాళ్లకు ఆప్యాయంగా పెట్టారు. నచ్చిందా అని అడిగారు. అది తిన్న వారందరూ వాహ్ అని మెచ్చుకున్నారు. తాను కూడా వారితో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button